Coal India Sanctions Rs.16 Crore | తమ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి కుమార్తె అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రాఫీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియడంతో సాయం చేసేందుకు కోల్ ఇండియా (సీఐఎల్) ముందుకొచ్చింది. సీఐఎల్ సబ్సిడరీ అయిన ఎస్ఈసీఎల్లో సతీష కుమార్ రవి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు.ఛత్తీస్గఢ్లో ఓవర్మ్యాన్గా సేవలందించే అతనికి సృష్టి అనే కుమార్తె ఉంది.
ఆ పాప వయసు రెండేళ్లు. ఆమెకు అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రాఫీ వ్యాధి ఉన్నట్లు ఇటీవల వెల్లడైంది. ఈ వ్యాధికి జోల్గాన్సిమా ఇంజెక్షన్ ఒక్కటే మందు. అయితే ఈ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు. ఈ విషయం తెలిసిన సీఐఎల్ అధికారులు సతీష్కు అండగా నిలిచారు. ఆ ఇంజెక్షన్కు కావలసిన నిధులను మంజూరు చేశారు. సీఐఎల్ సీఎండీ ప్రమోద్ అగర్వాల్ స్వయంగా రంగంలోకి దిగి, ఈ నిధులు మంజూరు అయ్యేలా చేశారు.