CNG Price | కేంద్రం మళ్లీ షాకిచ్చింది. సీఎన్జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై రూ. పెంచింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమలులోకి వచ్చాయి.
తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్జీ ధర రూ.81.09 నుంచి రూ.83.09కి చేరింది. సీఎన్జీ ధరలను పెంచడం మే 15వ తేదీ నుంచి ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మే 15వ తేదీన మొదట కిలోకు రూ.2 పెంచగా.. అనంతరం రెండుసార్లు ఒక్క రూపాయి చొప్పున కేంద్రం పెంచింది. తాజాగా మరో రూ.2 పెరగడంతో నాలుగోసారి సీఎన్జీ ధరలు పెరిగినట్లయ్యింది. గత 11 రోజుల్లో మొత్తం రూ.7 వరకు ధరలు పెరగడంతో వాహనదారులు, ఆటో, క్యాబ్, ట్రాన్స్పోర్ట్ రంగాలపై అదనపు భారం పడనుంది.
ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం.. ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నది. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచింది. సోమవారం నాడు పెట్రోల్పై లీటర్కు రూ. 2.61, డీజిల్పై లీటర్కు రూ. 2.71 చొప్పున ధరలు పెరిగాయి. తాజా పెంపుతో మే 15 నుంచి లీటర్కు మొత్తం పెంపు రూ.7.5కు చేరింది. గడచిన 11 రోజుల్లో ఇంధన ధరలు పెరుగడం ఇది నాలుగోసారి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.51 నుంచి రూ. 102.12 చేరుకోగా లీటర్ డీజిల్ ధర రూ. 92.49 నుంచి రూ. 95.20కి పెరిగింది.