మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సీఎం కుర్చీలో కూర్చుని అధికారులతో చర్చిస్తున్న ఫొటోపై రాజకీయ దుమారం రేగింది.
మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సహా విపక్ష నేతలు దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కుర్చీలో కూర్చున్న శ్రీకాంత్ ముందు అధికారులు చేతులు కట్టుకొని నిల్చోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఠాక్రే మండిపడ్డారు.