కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చురకలంటించారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు చూసి ముచ్చట పడొద్దని, ఆట ముగియలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువైనవి కావని హెచ్చరించారు. దేశంలోని మొత్తం శాసన సభ్యుల సంఖ్యలో సగం కూడా లేరని మమత విమర్శించారు. అలాంటి వారు సమాజ్వాదీ లాంటి పెద్ద పార్టీలాగ మాట్లాడొద్దని హితవు పలికారు. యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ ఓడిపోయినా… గతంలో కంటే బలపడిందని మమతా పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువు కాదు. దేశంలోని మొత్తం శాసన సబ్యుల సంఖ్యలో సగం కూడా ఆ పార్టీకి లేరు. ప్రతిపక్ష పార్టీలకు దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వున్నారు. ఆట ఇంకా ముగియలేదు. ఎన్నికల్లో సమాజ్వాదీ ఓడిపోయినా… గతంలో కంటే ఎక్కువ సీట్లే వచ్చాయి అంటూ మమత పేర్కొన్నారు.