న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో తల్లడిల్లిన దేశ రాజధాని ఢిల్లీ క్రమంగా తేరుకుంటోంది. కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో తాజాగా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత తొలిసారిగా శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దిగువకు పడిపోయింది. కేసుల సంఖ్య తగ్గుతుండటంతో లాక్ డౌన్ నియంత్రణలకు మరిన్ని సడలింపులు ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కరోనా తాజా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని మరిన్ని కార్యకలాపాలకు రానున్న రోజుల్లో అనుమతిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. సెకండ్ వేవ్ వ్యాప్తితో లాక్ డౌన్ ప్రకటించిన రోజున ఢిల్లీలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 27 శాతం ఉండగా ఇప్పుడది 2 శాతం లోపు పడిపోవడం ఊరట కలిగిస్తోంది.