Kejriwal | గోవా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్, ఆప్ మధ్య విమర్శల ధాటి పెరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని, తృణమూల్, ఆప్ కేవలం ఓట్లను చీలుస్తాయని వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా చిదంబరానికి కౌంటర్ ఇచ్చారు. గోవా ప్రజలకు ఎవరి పై విశ్వాసం ఉంటే వారు వారికే వేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆశలన్నీ బీజేపీపైనేనని, గోవా ప్రజలపై ఏమాత్రం లేవని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా… మీ ఓట్లు పోతున్నాయని ఏడవకండి అంటూ కేజ్రీవాల్ చురకలంటించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందన్నది తన ఊహ అని ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. తృణమూల్, ఆప్ కేవలం ఓట్లను చీల్చడానికే మాత్రమే ఉంటాయన్నారు. గోవాలో మార్పును కోరుకునేవారు కచ్చితంగా కాంగ్రెస్కు ఓటు వేస్తారని, యథాతథ స్థితిని కోరుకునే వారు బీజేపీకి ఓట్లు వేస్తారని చిదంబరం ట్విట్టర్లో అన్నారు.