ముంబై : ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైలో సమావేశమయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా పవార్ నివాసానికి వెళ్లారు. శరద్ పవార్తో దేశ రాజకీయాలపై సీఎం చర్చిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. శరద్ పవార్తో భేటీ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. పవార్తో భేటీ కంటే ముందు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన కేసీఆర్.. దాదాపు 2 గంటల పాటు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.