ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన అధికారిక నివాసమైన ‘వర్ష’ బంగ్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఉద్ధవ్ ఠాక్రేను కేసీఆర్ శాలువాతో సత్కరించారు. సుమారు రెండు గంటల పాటు భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బృందానికి ఉద్ధవ్ ఠాక్రే లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ అనంతరం సమావేశం జరిగింది.
మరికాసేపట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కేసీఆర్ కలవనున్నారు. సాయంత్రం 7.20 గంటలకు సీఎం కేసీఆర్ ముంబై నుంచి హైదరాబాద్కు రానున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం.. ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. pic.twitter.com/KX1xLKckgD
— Namasthe Telangana (@ntdailyonline) February 20, 2022