CM KCR | నాందేడ్ : మహారాష్ట్ర( Maharashtra ) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్( Devendra Fadnavis )కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో అమలవుతున్న పథకాలను అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను అని కేసీఆర్ స్పష్టం చేశారు. కంధార్ లోహా( Kandhar Loha )లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ( BRS Party Public Meeting )లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్కు మహారాష్ట్రలో ఏం పని అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో 24 గంటల కరెంట్( 24 Hours Power ) ఇస్తున్నాం. రైతుబంధు( Rythubandhu ), రైతుబీమా అమలు చేస్తున్నాం. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నాం. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే నేను మహారాష్ట్రకు రానని ప్రకటిస్తున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో దళిత బంధు( Dalit Bandhu ) అమలు చేస్తున్నాం. దళిత వజ్రం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్( Ambedkar ) పుట్టిన ఈ గడ్డపై దళిత బంధు అమలు చేస్తే రానని ప్రకటిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో రైతుల సమస్యలు పరిష్కరించండి.. మరోసారి నేను రాను. ఇవన్నీ అమలు చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తే.. నేను మహారాష్ట్రకు రావడం మానేస్తాను అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.