Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన ఈ యాత్ర చేపట్టారు. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో పూర్తైన ఈ యాత్ర.. ఆదివారం సాయంత్రం రాజస్థాన్లోకి ప్రవేశించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 17 రోజులు 500 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది.
కాగా, రాహుల్ యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లోకి ప్రవేశించడంతో అక్కడ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాజస్థాన్కు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఒకే వేదికపైకి వచ్చారు. అంతేకాదు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి కాలు కదిపారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని గిరిజన నృత్యం చేశారు. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కీలక నేత కమల్ నాథ్ కూడా వేదికపైకి వచ్చి వీరితో చేయి కలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Congress MP Rahul Gandhi, Rajasthan CM Ashok Gehlot & party leaders Sachin Pilot and Kamal Nath take part in a tribal dance in Jhalawar, Rajasthan. pic.twitter.com/18NgWYrWrk
— ANI (@ANI) December 4, 2022
स्वागत, संगीत और सेल्फी।#भारत_जोड़ो_संग_म्हारो_राजस्थान pic.twitter.com/f7g3Ywth9Q
— Congress (@INCIndia) December 4, 2022