డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైంది. ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు 20 చోట్ల విజయం సాధించగా.. మరో 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 47 స్థానాల్లో గెలుపొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలువగా.. ఆరు స్థానాల్లో విజయం దిశగా ముందుకెళ్తున్నది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే విడుతలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 43 స్థానాల్లో ఫలితాలు వెలువడగా.. ఇంకా 27 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నది.
ఇదిలా ఉండగా.. సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని మరోసారి చేపట్టనున్న బీజేపీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖతిమా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సీఎం పుష్కర్ సింగ్ దామీ.. కాంగ్రెస్ భువన్ చంద్ కప్రీ చేతుల్లో 6,951 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అలాగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ సైతం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. లాల్కువాన్ స్థానం నుంచి బరిలో నిలిచిన హరీశ్రావత్ బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్త్ చేతిలో దాదాపు 16వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంధ్య దళకోటి.. మాజీ సీఎం గెలుపు అవకాశాలను దెబ్బకొట్టారు. హరీశ్ రావత్కు వరుసగా ఇది రెండో భారీ ఓటమి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.