న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మంగళవారం కలువనున్నారు. పంజాబ్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు ఆయనను పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. సీఎం అమరీందర్ సింగ్పై నవజోత్ సింగ్ సిద్ధు తిరుగుబాటును చక్కదిద్దేందుకు ఒక ఫార్ములాను కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. సిద్ధూ ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమై తన అసంతృప్తిని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు డిప్యూటీ సీఎం లేదా పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం అమరీందర్ సింగ్ దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చడంతోపాటు పంజాబ్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించే క్రమంలో సీఎం అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తున్నది.