న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థులు స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్యూ క్యాంపస్లోని ఆ విభాగం వద్ద సోమవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఏబీవీపీ అధ్యక్షుడు రోహిత్ కుమార్తో సహా పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
కాగా, స్కాలర్షిప్ల విడుదల కోసం తాము శాంతియుతంగా నిరసన చేస్తున్నామని విద్యార్థులు తెలిపారు. అయితే జేఎన్యూ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని ఉసిగొల్పి తమపై దాడి చేయించారని ఆరోపించారు. మహిళలు, దివ్యాంగులపై కూడా సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసినట్లు విమర్శించారు. నాన్-నెట్ స్కాలర్షిప్లు, మెరిట్-కమ్-మీన్స్, జేఆర్ఎఫ్ కూడా గత రెండేళ్లుగా విడుదల కాకపోవడంతో తాము చాలా ఇబ్బంది పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. మరోవైపు ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
JNU के रेक्टर के भ्रष्टाचार का खुलासा करने के बाद जब ABVP JNU के कार्यकर्ता JNU के छात्रों के वर्षों से ठप छत्रवृति के लिए आंदोलन कर रहे थे तब JNU के सिक्योरिटी गॉर्ड के रूप में तैनात रेक्टर के गुंडों ने छत्रों पर हमला किया। #JNURector_gunda_hai#JNURector_must_resign pic.twitter.com/2NWM6iOu2K
— ABVP JNU (@abvpjnu) August 22, 2022
Ye gardan se kon or kyu khich raha hai security hai ya gunde?#JNU_Rector_gunda_hai#JNU_rector_must_resign pic.twitter.com/cnkSRptEI0
— Kratika Sen JNU (@kratikas_Jnu) August 22, 2022