షిల్లాంగ్: అస్సాం, మేఘాలయలోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘటనలో అస్సాంకు చెందిన ఓ వ్యక్తి గాయపడినట్టు అధికారులు తెలిపారు. మేఘాలయలోని వెస్ట్ జైంతియా జిల్లా లపాంగాప్ గ్రామం, అస్సాంలోని అంగ్లాంగ్ జిల్లా తపట్ ప్రాంతం సరిహద్దు వద్ద మంగళవారం ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్టు వెల్లడించారు. ఇరు రాష్ర్టాలకు చెందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.