న్యూయార్క్, జూన్ 26: ఎందరో మహానుభావులు పోరాడి సాధించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రపంచంలోని ప్రతి ఒక్క పౌరుడూ అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తద్వారానే వారి త్యాగాలకు మనమిచ్చే ఘన నివాళులు అవుతుందని అన్నారు.
అమెరికాలో ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్ హాల్ను జస్టిస్ రమణ ఆదివారం సందర్శించారు. ఈ స్మారక చిహ్నం మానవ నాగరికతలో నిర్ణీత ఘట్టాన్ని సూచిస్తుందని, అన్ని ప్రజాస్వామ్యాలు పవిత్ర స్థలం నుంచి ఉద్భవించిన విలువల నుంచి ప్రేరణ పొందాయని పేర్కొన్నారు.