భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శనివారం రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ను సందర్శించారు. గార్డెన్ మొత్తం కలియ తిరిగారు. వీరితో పాటు సుప్రీం న్యాయమూర్తులు కూడా వారి వారి కుటుంబీకులతో మొఘల్ గార్డెన్ను సందర్శించారు. వీరందరికీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు స్వాగతం పలికారు.
అయితే వీరందరూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వచ్చారు. ఇలా రాష్ట్రపతి ప్రత్యేక ఆహ్వానం పంపడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు వార్షిక నివేదికను రాష్ట్రపతి రాంనాథ్కు సమర్పించారు. వీరందరికీ రాష్ట్రపతి రాంనాథ్ ప్రత్యేక విందు ఇచ్చారు.