తిరుపతి : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) ఎన్వీ రమణ తిరుమల పర్యటన ముగిసింది. రెండ్రోజుల పర్యటన కోసం ఆయన తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తిరుమల చేరుకున్నారు.
పద్మావతి అతిథిగృహం వద్ద జస్టిస్ రమణకు ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తన పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు వీడ్కోలు పలికారు.