న్యూఢిల్లీ: ఇటీవల హరిద్వార్లో జరిగిన ధర్మ సంసద్ సమావేశంలో కొందరు హిందూ ధార్మిక నేతలు విద్వేష ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని విచారిస్తామని ఇవాళ సుప్రీంకోర్టులో సీజే ఎన్వీ రమణ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ వేసిన పిటిషన్పై ఆయన స్పందించారు. ధర్మ సంసద్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేశామని, మన దేశ నినాదం సత్యమేవ జయతే నుంచి సశాస్త్రమేవ జయతేకు మారిందని సిబాల్ అన్నారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని, ఈ కేసులో ఏదైనా విచారణ జరిగిందా అని సీజే ప్రశ్నించారు. ఈ కేసులో కేవలం ఎఫ్ఐఆర్ను మాత్రమే నమోదు చేశారని సిబాల్ తెలిపారు. డిసెంబర్ 17 నుంచి 19 వరకు జరిగిన మతనేతల సమావేశాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా ఆయుధాలు వాడాలని ధార్మిక నేతలు పిలుపునిచ్చారు.