న్యూఢిల్లీ, మే 7: వైద్యులపై దాడుల ఘటనలు పెరుగడంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెడుతుండటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులకు మరింత మెరుగైన, భద్రతతో కూడిన పని వాతావరణం ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. డాక్టర్ సీఎస్ పంత్, డాక్టర్ వనీత కపూర్ రచించిన పుస్కకావిష్కరణలో సీజేఐ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల బాగు కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వైద్యులను ప్రశంసించారు. ‘వైద్యులు మార్గదర్శకులు, స్నేహితులు, సలహాదారులు. అటువంటి వారు ఈ సమాజంలో ఎల్లప్పుడూ క్రియాశీలకంగా ఉండాలి. ప్రజల ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలి’ అని అన్నారు.