న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్కు ‘అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్’ను హార్వర్డ్ లా స్కూల్లోని సెంటర్ ఆన్ ది లీగల్ ప్రొఫెషన్ శనివారం ప్రదానం చేసింది. ఆయన ఈ పురస్కారాన్ని హార్వర్డ్ లా స్కూల్లో స్వీకరించారు. ఈ అవార్డుకు ఆయనకు ఎంపికచేసినట్టు జనవరిలో ప్రకటించారు.
అవార్డు స్వీకరణ అనంతరం జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ఈ కళాశాలలో తాను చదువుకున్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తాను సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమలు చేసిన సంస్కరణలను వివరించారు. విద్యార్థులు ఇంటర్డిసిప్లినరీ స్టడీస్ చేయాలని సూచించారు. మెడికల్ సైన్స్, టెక్నాలజీ వంటివాటికి న్యాయశాస్త్రంతో సంబంధం ఉంటుందన్నారు.