న్యూఢిల్లీ: తన అధికారాల జోలికి రావద్దని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) చంద్రచూడ్ ఓ న్యాయవాదిని మంగళవారం హెచ్చరించారు. ఈ నెల 17న విచారించేలా కేసును లిస్టు చేశామని, మరొక బెంచ్కు మార్చుకొనే స్వేచ్ఛ కూడా ఇస్తున్నామని తెలిపారు.
అయితే, 14వ తేదీన విచారణ చేపట్టాలని లాయర్ ప్రస్తావించగా.. ‘నా ఎదుట ట్రిక్స్ ప్లే చేయకండి. ముందస్తు తేదీ కోసం మీరు ఎక్కడా ప్రస్తావించలేదు’ అని న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు న్యాయవాది క్షమించాలని కోరడంతో సీజేఐ ఆయనను క్షమించారు.