న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(BR Gavai) అస్వస్థతకు గురయ్యారు. ఇన్ఫెక్షన్ వల్ల ఆయన ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ట్రీట్మెంట్కు ఆయన స్పందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శనివారం ఆయన హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. నాల్సర్ న్యాయ విద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన కోలుకునే అవకాశం ఉన్నట్లు అధికారి తెలిపారు. జూలై 12వ తేదీన సీజేఐ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ టూర్ సమయంలో ఆయన స్పెషల్ పోస్టల్ కవర్ను కూడా రిలీజ్ చేశారు.