భోపాల్: డ్రోన్ టెక్నాలజీ రైతులకు ఎంతో సహాయపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో డ్రోన్ ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సింధియా మాట్లాడారు. రైతులు తమ పొలాల్లో పురుగు మందులను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయవచ్చని తెలిపారు. ఇది కేవలం రాష్ట్ర విప్లవం మాత్రమే కాదని, డ్రోన్ సాంకేతికతతో దేశం మొత్తం ప్రయోజనం పొందుతుందని అన్నారు.
మరోవైపు జిల్లాలోని శంకర్పూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గ్వాలియర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు. అలాగే వారితో కలిసి గ్రౌండ్లో పరుగులు తీశారు.
#WATCH | Union Minister Jyotiraditya Scindia inspected the under-construction Gwalior International Cricket Stadium in Shankarpur area of the district, on 9th Dec. During the inspection, the Minister played cricket with officials & party leaders-workers, & also sprinted with them pic.twitter.com/fIQ7MSE0yl
— ANI (@ANI) December 11, 2021