అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధానంగా దృష్టిసారించింది. ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే స్వల్ప తేడాతో ఆప్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నివేదిక ద్వారా ఈ విషయం తెలిసిందని అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున తమ పార్టీకి మరింత మద్దతు ఇవ్వాలని గుజరాత్ ప్రజలను కోరారు.
కాగా, గుజరాత్లో ఆప్ ఓట్లను చీల్చేందుకు బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఐబీ నివేదిక ద్వారానే ఈ విషయం కూడా తెలిసిందని చెప్పారు. ఐబీ నివేదికతో బీజేపీ అసంతృప్తిగా ఉందని, దీంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఉన్నత స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు.
IB Report से बड़ा खुलासा!
आज Gujarat में चुनाव हो तो AAP की सरकार बन रही है:Sources
रिपोर्ट से बुरी तरह बौखलाई BJP, Congress के साथ Secret Meetings कर रही है
भाजपा का प्रयास-कांग्रेस को मज़बूत कर Anti-BJP Vote बांटो
कांग्रेस की ज़िम्मेदारी-AAP के वोट काटो
-CM @ArvindKejriwal pic.twitter.com/e1j35pQAxI
— AAP (@AamAadmiParty) October 2, 2022