న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట్లోకి వెళ్లి సర్వీస్ గన్తో కాల్చుకుని మరణించాడు. (Jawan Shoots Dead) ఆ జవాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్లోని సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగింది. జైపూర్కు చెందిన 32 ఏళ్ల కిషన్ సింగ్ సీఐఎస్ఎఫ్ జవాన్గా అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎయిర్పోర్ట్లోని టాయిలెట్కు వెళ్లాడు. సర్వీస్ రైఫిల్తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, గమనించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కిషన్ సింగ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ జవాన్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. కిషన్ సింగ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసి ఎయిర్పోర్ట్లోని సిబ్బంది భయాందోళన చెందారు.