న్యూఢిల్లీ, మే 1: అమెరికా నిఘా సంస్థ సీఐఏ మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్ చందనీ నియమితులయ్యారు. సీఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ ఈ మేరకు ప్రకటన చేశారు. మూల్చందనీ ఢిల్లీలోని బ్లూబెల్స్ స్కూల్ ఇంటర్నేషనల్లో 1979-1987 మధ్యలో చదువుకొన్నారు. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేశారు.