న్యూఢిల్లీ: రఫేల్ డీల్ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కౌంటర్ వేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆదివారం ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ చోర్ కీ దాడీ (దొంగ గడ్డం) అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొటోలో రఫేల్ విమానం నుంచి వచ్చిన పొగ మోదీ గడ్డంలా కనిపిస్తోంది. రఫేల్ డీల్పై ఫ్రాన్స్ న్యాయ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు రాహుల్ గాంధీ. ఈ డీల్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మొదటి నుంచీ రఫేల్ డీల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్తోపాటు రాహుల్గాంధీ ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశించిన ఈ విచారణతో తాము చెప్పిందే నిజమైందని కాంగ్రెస్ వాదిస్తోంది.