పాట్నా: హిందూ చట్టం, భారత రాజ్యాంగం ప్రకారం రామ్ విలాస్ ప్వాశ్వాన్ ఆస్తులకు చిరాగ్ పాశ్వాన్ వారసుడని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. అయితే తాను రామ్ విలాస్ రాజకీయ వారసత్వంతో ఆశీర్వదించబడ్డానని అన్నారు. తన బంధువైన చిరాగ్కు తాను ఏ బాధ కలిగించనని చెప్పారు. అయితే చిరాగ్ ట్రాక్ దాటారని, అందుకే అతడ్ని పార్టీలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారని అన్నారు. లోక్సభలో ఎల్జేపీ నేతగా తన ఎన్నికపై చిరాగ్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని కేంద్ర మంత్రి పశుపతి కుమార్ స్వాగతించారు. కోర్టు నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని ఆయన వెల్లడించారు.