న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను కలిశారు. తమ దేశానికి రావాలంటూ ధోవల్కు చైనా విదేశాంగ మంత్రి ఆహ్వానం అందించారు. దీనిపై జాతీయ భద్రతా సలహాదారు పాజిటివ్గా స్పందించారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు విజయవంతంగా పరిష్కారం అయిన తర్వాత కచ్చితంగా చైనాకు వస్తానని ధోవల్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలంటే, లడాక్తో పాటు ఇతర వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తమ దళాలను ఉపసంహరించాలని ధోవల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి ఆమోదయోగ్యంగా లేదన్నారు. శాంతి స్థాపనతోనే ఇరు వర్గాల మధ్య నమ్మకం ఏర్పడుతుందని రెండు దేశాలు పేర్కొన్నాయి.