ముంబై: చైనా నుంచి పాకిస్థాన్కు అణు సంబంధ సరుకుతో వెళ్తున్న ఒక నౌకను ముంబైలోని హ్నవా శెవా పోర్టులో భారత భద్రతా దళాలు అడ్డుకుని సీజ్ చేశాయి. అణు, బాలిస్టిక్ క్షిపణుల తయారీకి వినియోగించే సరుకు ఉండటంతో దీనిని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
నౌకలో తనిఖీలు చేసినప్పుడు అధికారులకు ఇటాలియన్ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్ న్యూమరికల్ మిషన్ (సీఎన్సీ)ను కనుగొన్నారు. ఈ మిషన్ను పాకిస్థాన్ అణు కార్యకలాపాలకు, క్షిపణి తయారీకి వినియోగించేదని నిర్ధారించారు.