న్యూఢిల్లీ: గణతంత్య్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్పై ఆర్డీ పరేడ్ను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్కు చెందిన కొత్త మార్గదర్శకాలను ఢిల్లీ పోలీసులు రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసుకోని వారిని, 15 ఏండ్ల లోపు చిన్నారులకు ఆర్డీ ఈవెంట్కు అనుమతించడం లేదన్నారు. కోవిడ్ నిబంధనలను ప్రజలు పాటించాలని, మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టాన్స్ పాటించాలని పోలీసులు కోరారు. ఈవెంట్ను తిలకించేందుకు వచ్చే విజిటర్స్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పక చూపించాలి. ఈ నెలలోనే 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. విజిటర్స్కు సీటింగ్ బ్లాక్స్ను ఉదయం ఏడు గంటలకు తెరవనున్నట్లు చెప్పారు. ఆర్డీ ఈవెంట్ సెక్యూర్టీ కోసం 27 వేల మంది పోలీసుల్ని మోహరించనున్నట్లు ఢిల్లీ పోలీసు కమీషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. ఎయిర్ స్పేస్ సెక్యూర్టీ కోసం డ్రోన్లను వాడుతున్నారు. ట్రాఫిక్ కోసం ప్రత్యేక అడ్వైజరీ కూడా జారీ చేశారు.