అయోధ్య: అయోధ్యలోని సరయూ నదిలో ఇవాళ ఆచార్య సత్యేంద్ర దాస్(Acharya Satyendra Das) పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతకుముందు గోపాల్ ఆశ్రమంలో ఆయన పార్దీవదేహాన్ని ఉంచారు. అంతిమయాత్రలో సాధువులు, రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 85 ఏళ్ల దాస్ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎస్జీపీజీ)లో చేర్చారు. తన 20వ ఏట సన్యాస దీక్ష తీసుకున్న సత్యేంద్ర దాస్ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామ జన్మభూమి ఆలయ పూజారిగా ఉన్నారు.
#WATCH | Acharya Satyendra Das, the chief priest of Ayodhya Ram temple, who passed away yesterday, given ‘Jal Samadhi’ in Saryu river in UP’s Ayodhya pic.twitter.com/zrYkaLZUrT
— ANI (@ANI) February 13, 2025
ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి పట్ల బాబ్రీ మసీదు మాజీ అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ స్పందించారు. అంతియాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆచార్య పార్దీవదేహాన్ని తీసుకెళ్లిన వాహనాన్ని ఆయన లాగారు. దాస్ పట్ల ఉన్న ఐక్యతను, గౌరవాన్ని ఆయన చూపించారు. చాన్నాళ్లుగా కలిసి ఉన్నామని, ఎప్పుడూ ఐక్యత, సామరస్యం గురించి మాట్లాడుకున్నామని, కలిసి జీవించడంలో ఉన్న ఆందాన్ని సెలబ్రేట్ చేసుకున్నామని, కానీ ఇప్పుడు తన సహచరుడిని కోల్పోయినట్లు అడ్వకేట్ అన్సారీ తెలిపారు.