కోల్కతా: బెంగాల్లో ఎరువుల కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సీఎం మమత బెనర్జీ బుధవారం అసెంబ్లీలో పేర్కొన్నారు.
కేంద్రం బెంగాల్కు కేటాయించిన కోటాలో కేవలం మూడింట ఒకవంతు మాత్రమే సరఫరా అవుతున్నాయని, దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాశానని తెలిపారు. ఎరువులు సరిపడా సరఫరా కాకపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.