న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ( NV Ramana ) ఇటీవల పార్లమెంటులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా, మీడియాలో ఊహజనిత కథనాలు పెరిగిపోవడంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరుగకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. అవి అసలు పార్లమెంట్ సమావేశాలేనా..? అంటూ ప్రభుత్వానికి చురకలు వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంపై మీడియాలో ఊహాజనిత కథనాలు ప్రసారం కావడంపై కూడా సీజేఐ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీజేఐగా పదవిలోకి వచ్చినప్పుటి నుంచి ఇలా సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ మీడియాలో ఉంటున్న ఎన్వీ రమణ.. తాజాగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మొక్కను నాటారు. తన సతీమణి శ్రీమతి శివమాలతో కలిసి ఆయన ఆమ్రాపాలి రకం (మాంజిఫెరా ఇండికా) మామిడి మొక్కనట్టు నాటినట్టు సీజేఐ అధికారిక నివాస వర్గాలు వెల్లడించాయి.