న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) వైకే సిన్హా మంగళవారం పదవీ విరమణ చేశారు. తదుపరి సీఐసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. తన పదవీ కాలంలో సిన్హా పెండింగ్ కేసుల సంఖ్యను 50 శాతానికిపైగా తగ్గించారు.
సమాచార కమిషన్లో ప్రస్తుతం ఒక సీఐసీ, నలుగురు కమిషనర్లు ఉన్నారు. సిన్హా పదవీ విరమణతో నలుగురు కమిషనర్లే ఉన్నారు. వీరి పదవీకాలం నవంబర్తో ముగుస్తుంది.