రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా బెజ్జీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టుతు చనిపోయాడు. సోమవారం ఉదయం భందర్పదర్ గ్రామసమీపంలోని బెజ్జీ అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డులు (DRG) మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల సమయంలో గాలింపు బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని, పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయాడని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మృతుడిని మాడ్ డివిజన్ కమిటీ కమాండర్ హడ్మా అలియాస్ సంకుగా గుర్తించామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నది వెల్లడించారు.
కాగా, గత పదిరోజుల వ్యవధిలో సుక్మా జిల్లాలో కాల్పులు చోటుచేసుకోవాడం ఇది మూడోసారి. మూడు ఎన్కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. జులై 29న బింద్రపాణి గ్రామంలో, పల్బగాడి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.