రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దంతేబాడ (Dantewada) జిల్లాలో భద్రతా బలగాలులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు ఏరియా కమాండర్ మృతిచెందారు. దంతేవాడ జిల్లాలోని బుర్గాం అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో తప్పించుకునే క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో బుర్గాం ఏరియా మావోయిస్టు కమాండర్ లక్మ మృతిచెందారని పోలీసులు తెలిపారు. అతనిపై గతంలో రూ.5 లక్షల రావార్డు ఉందని చెప్పారు.