సుక్మా: మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలుపడం కోసం గత ఆగస్టులో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పోలీసులు చేపట్టిన పూనా నర్కోమ్ ( స్థానిక గోండు భాషలో కొత్త డాన్ అని అర్థం) క్యాంపెయిన్ బాగానే పనిచేస్తున్నది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను గురించి తెలియజేస్తూ సుక్మా పోలీసులు నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్యాంపెయిన్తో ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.
తాజాగా ఇవాళ కూడా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. వాళ్లలో తొమ్మది మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. తలపై ఒక లక్ష రూపాయల రివార్డు ఉన్న పొడియామి లక్ష్మణ్ కూడా లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు. సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. తాజాగా లొంగిపోయిన 43 మందితో కలిపి జిల్లాలో ఇప్పటివరకు లొంగిపోయిన మొత్తం మావోయిస్టుల సంఖ్య 176కు చేరిందని ఆయన తెలిపారు.