పుణె : ట్రాఫిక్ సమస్యతో నిత్యం అల్లాడే పుణె నగరంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి దేశంలోనే మొదటిసారిగా గూగుల్ ఇండియా సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య గత ఏడాది జరిగిన ఎంవోయూ మేరకు ‘ట్రాఫిక్యూర్’ అనే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థ గూగుల్ మ్యాప్లను వినియోగించి నగర రియల్టైమ్ ట్రాఫిక్ పరిస్థితులను నియంత్రిస్తుంది. తద్వారా రద్దీని నియంత్రించి రోడ్డుపై ట్రాఫిక్ సాఫీగా సాగేలా సహకరిస్తుంది.
ఈ వ్యవస్థను పుణెలోని 550 జోన్లలో ఏర్పాటు చేశారు.ఎప్పటికప్పుడు వాహనాల రద్దీ, ఇతర అంశాలను పరిశీలిస్తూ ట్రాఫిక్ పోలీస్కు సూచనలు అందిస్తూ సహాయకారిగా ఉంటుంది. దీనిని ఇప్పటికే ఈ ఏడాది మొదట్లో 45 రోజుల పాటు పరీక్షించామని పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ వెల్లడించారు. దీని కారణంగా వాహనాల సగటు వేగం గంటకు 20 కి.మీ నుంచి 26.8 కి.మీకు పెరిగిందని తెలిపారు.