బెంగళూరు: ‘బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అనొద్దు. అలా అని హైదరాబాదీనైన నన్ను అవమానించొద్ద’ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్లో ‘చాట్ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ రోబోను పరిచయం చేశారు. ఆ రోబోతో మాట్లాడారు. భవిష్యత్తులో పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏముంటాయని ఆయన చాట్ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అని తనను అవమానించొద్దన్నారు. దీంతో వెంటనే చాట్ రోబో క్షమాపణ చెప్పింది.