పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీపై మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేవలం నైట్ వాచ్మెన్గా మిగిలిపోతారని అమరీందర్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్లో ఆయనకు తగిన న్యాయం జరగడం లేదని, పార్టీ ఆయన్ను పట్టించుకోవడం లేదని అమరీందర్ విమర్శించారు. సీఎం చన్నీకి కావల్సిన అర్హతలన్నీ ఉన్నాయని, అయినా, సిద్దూకు విధేయుడిగానే ఉండిపోతున్నారని అన్నారు. ఎన్నికల కమిటీలో సీఎంను కేవలం సభ్యునిగా మాత్రమే అధిష్ఠానం ప్రకటించిందని, ఆత్మాభిమానం ఉన్న నేత ఎవ్వరు కూడా ఈ వివక్షను జీర్ణించుకోలేరని అమరీందర్ సింగ్ అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఆ కమిటీకి సిద్దూ నాయకత్వం వహిస్తున్నారు. అయితే సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని మాత్రం కేవలం సభ్యునిగా మాత్రమే నియమించింది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం అమరీందర్ పై వ్యాఖ్యలు చేశారు.