చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ పరాజయం పాలవడంతో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం మద్యాహ్నం రాజ్భవన్కు చేరుకున్న చన్నీ గవర్నర్కు రాజీనామా పత్రాలను అందచేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకూ పదవిలో కొనసాగాలని గవర్నర్ కోరారు.
ఇక తాము చేపట్టిన సంక్షేమ పధకాలు, కార్యక్రమాలను కొనసాగించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. పంజాబ్ ప్రజలకు సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు. మరోవైపు పంజాబ్ సీఎంగా ఆప్ నేత భగవంత్ మాన్ ఈనెల 16న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్ధానాలను దక్కించుకుని విజయ కేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్ధానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) మూడు స్ధానాలు, బీజేపీ కేవలం 2 స్ధానాల్లో గెలుపొందాయి.