లక్నో: ఉత్తరప్రదేశ్లోని సిరతు కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ స్థానంలో పోటీ చేసిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తొలి నుంచి వెనుకంజలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీతో పొత్తున్న అప్నా దళ్ అభ్యర్థి పల్లవి పటేల్ ముందంజలో ఉన్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
మరోవైపు కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడు, యోగేష్ దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశాంబి జిల్లాలోని సిరతు నియోజకవర్గం స్థానానికి కౌంటింగ్ను నిలిపివేశారు. కాగా, 29వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య 6,397 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయనకు 92,366 ఓట్లు రాగా, పల్లవి పటేల్కు 98,763 ఓట్లు పోలయ్యాయి. మరో రెండు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉన్నది.