పాట్నా: ఒక ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లో ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఆ రైలు ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ గందరగోళం నేపథ్యంలో అర కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిన ఆ రైలు వెనక్కి మళ్లి స్టేషన్కు చేరుకున్నది. (Train Reverse) బీహార్లోని సరన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాప్రా – ఫరూఖాబాద్ మధ్య నడిచే ఉత్సర్గ్ ఎక్స్ప్రెస్ బుధవారం రాత్రి 7 గంటలకు చాప్రా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. రాత్రి 7.26 గంటలకు మాంఝీ స్టేషన్ వద్ద ఆగాల్సి ఉంది. అయితే ఆ రైల్వే స్టేషన్లో రైలు ఆపడాన్ని లోకో పైలట్ మరిచిపోయాడు. దీంతో ఆ రైలు ఆగకుండా వెళ్లడంతో ఆ స్టేషన్ వద్ద ఉన్న ప్రయాణికులు, అక్కడ దిగాల్సిన వారు ఆందోళన చెందారు.
కాగా, ఆ స్టేషన్ దాటి అర కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిన ఆ రైలు ఒక బ్రిడ్జీపై ఆగింది. అనంతరం లోకో పైలట్, గార్డు జరిగిన పొరపాటును ఆ స్టేషన్ మాస్టార్కు వివరించారు. ఆ ట్రాక్లో ఇతర రైళ్లు రాకుండా సమీపంలోని స్టేషన్ మాస్టార్లను అలెర్ట్ చేశారు. అనంతరం ఆ రైలు వెనక్కి ప్రయాణించి మాంఝీ స్టేషన్కు చేరింది. ఈ సంఘటన నేపథ్యంలో ఆ రైలు సుమారు 20 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకున్నది.