చండీగఢ్, జనవరి 30: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చామ్కౌర్ సాహిబ్తో పాటు భదౌర్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీ పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ తాజాగా ప్రకటించింది. చన్నీ చామ్కౌర్లో ఓడిపోతారని సర్వేల్లో తేలిందని, అందుకే కాంగ్రెస్ ఆయనను మరో స్థానం నుంచి పోటీ చేయిస్తున్నదని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.