న్యూ ఢిల్లీ: దేశంలో ఇక అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ నాలుగేళ్లుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రొగ్రామ్కు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ విద్యా విధానం -2020 (NEP-2020) ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
యూజీసీ చైర్మన్, సభ్యులతో మార్చి 10న నిర్వహించిన 56వ సమావేశంలో నాలుగేళ్ల డిగ్రీ అమలు విధానాన్ని నిర్ణయించారు. ఒక్కొక్క సెమిస్టర్ 90 రోజుల చొప్పున ఉంటుంది. మొత్తం 8 సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు సెమిస్టర్లో మానవీయ శాస్ట్రాలు (హ్యుమానిటీస్), సామాజిక శాస్త్రం, గణితం, వృత్తి విద్యకు సంబంధిచినవి చదువుతారు.
మూడు సెమిస్టర్లు ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థి డిగ్రీలో తన మేజర్, మైనర్ సబెక్ట్లు ఎంపిక చేసుకోవాలి. 7,8 సెమిస్టర్లో తాము ఎంచుకున్న సబ్జెక్ట్లోని ఏదో ఒక అంశంపై రీసెర్చ్ చేయాలి. ఈ ఏడాదే ఢిల్లీ యూనివర్సిటీ ఈ విధానాన్ని అమలుచేయనుంది. కాగా, మిగతా యూనివర్సిటీలు కూడా త్వరలో ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది.