శ్రీహరికోట: చంద్రయాన్-3(Chandrayaan-3) ప్రాజెక్టును జూలైలో చేపట్టనున్నట్లు భారతీయ అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇవాళ జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ గురించి ప్రశ్న వేయగా .. ఆ మిషన్ జూలైలో జరుగుతుందని, దానిపై పూర్తి నమ్మకంగా ఉన్నట్లు సోమనాథ్ తెలిపారు.
చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్లో మొత్తం మూడు రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్ మాడ్యూల్ ఉండనున్నాయి. ఇప్పటికే ఇస్రో రెండు సార్లు చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపిన విషయం తెలిసిందే.
#WATCH | "Chandrayaan-3 will be launched in July this year," says S Somanath, chief of Indian Space Research Organisation (ISRO) pic.twitter.com/J98aXfgmmI
— ANI (@ANI) May 29, 2023
బెంగుళూరులో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో రూపుదిద్దుకున్న మూన్ శాటిలైట్ ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నది. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో చంద్రయాన్-3ను తీసుకువెళ్లే ఎల్వీఎం రాకెట్ను రూపొందిస్తున్నారు. ఈ స్పేస్క్రాఫ్ట్ మూడు వారాల్లో మూన్ వద్దకు వెళ్లనున్నది.
చంద్రయాన్-2 ద్వారా పంపిన ఆర్బిటార్ ఇంకా పనిచేస్తున్నది. మూన్ ఉపరితలంపై ఉన్న ఆ ఆర్బిటార్ ఇంకా హై రెజల్యూషన్ ఇమేజ్లను పంపుతోంది.