Chandrayan-3 | బెంగళూర్ : చంద్రుడి కక్ష్యలోకి చేరటమనే అత్యంత కీలక ఘటాన్ని చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తిచేసుకుంది. చంద్రుడి కక్ష్యలో స్పేస్క్రాఫ్ట్ను ప్రవేశపెట్టడం సంక్లిష్టమైన, సవాల్తో కూడిన వ్యవహారం. దీనిని విజయవంతంగా పూర్తిచేశామని శనివారం ఇస్రో ప్రకటించింది. బెంగళూర్లోని ఇస్రో కేంద్రం నుంచి మాక్స్, టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ ప్రక్రియల్ని చేపట్టడం ద్వారా స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో తెలిపింది. ‘ ఐయామ్ ఫీలింగ్ లూనార్ గ్రావిటీ’ అన్న సందేశం తమకు అందిందని ఇస్రో వెల్లడించింది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ప్రైవేట్ సంస్థతో పంచుకునేందుకు ఇస్రో ముందడుగు వేసింది. శాటిలైట్ బస్ టెక్నాలజీ (వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ)ని వాణిజ్యపరంగా విస్తరించి దేశ అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏడీటీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్ఎస్ఐఎల్ చైర్మన్, ఎండీ డీ రాధాకృష్ణ, అల్ఫా చైర్మన్ హెచ్ఎస్ శంకర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాణిజ్యపరంగా శాటిలైట్స్ను ఉత్పత్తి చేయటంలో ముందడుగుగా ఇస్రో పేర్కొన్నది.