Chandrayaan-3 | ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండై.. భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా నిలువగా.. దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా అవతరించింది. ఇస్రో మిషన్లో విక్రమ్ ల్యాండర్ను చంద్రుడి ఉపరితలంపై నింపగా.. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై ప్రయాణించింది. అయితే, ఈ రోవర్ ప్రత్యేకలున్నాయి. ఆరు చక్రాలు ఉండగా.. ఇందులో భారతదేశ చిహ్నమైన అశోక స్తంభంతో పాటు ఇస్రో లోగో ఉన్నాయి. చంద్రుడి ఉపరితలంపై కదులుతున్న సమయంలో ఉపరితలంపై జాతీయ చిహ్నం, ఇస్రో లోగోలను ముద్రించేలా ఏర్పాట్లు చేశారు.
అయితే, ఇస్రో అనుకున్నంత విజయవంతం కాలేదని, చంద్రుడి ఉపరితలంపై జాతీయ చిహ్నం, ఇస్రో లోగోలు అనుకున్నంత స్పష్టంగా రాలేవని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇది ఏమాత్రం చింతించాల్సిన విషయం కాదని, చంద్రుడి ఉపరితలంపై చిహ్నాలు లేకపోయినా దక్షిణ ధ్రువంలోని నేల గురించి పూర్తిగా అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు. చంద్రుడి ఉపరితలంపై మట్టి లేదని, అది కీలకంగా మారిందని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. దేంతో తయారైందో తెలుసుకోవచ్చన్నారు. వాస్తవానికి చంద్రుడి నేల మురికిగా ఉండదని.. ముద్దగా ఉందని, ఇది అక్కడ కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఉన్నట్లు చూపిస్తుందని తెలిపారు. ప్రజ్ఞాన్ రోవర్ శివశక్తి పాయింట్ చుట్టూ 105 మీటర్లు నడిచింది. గత 18 రోజులుగా రోవర్ నిద్రలో ఉండడంతో దాన్ని మేల్కొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది.
ప్రజ్ఞాన్ రోవర్లో రెండు పేలోడ్లను అమర్చారు. ఒకటి బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్.. ఇది మూలకాల కూర్పుపై అధ్యయనం చేయనున్నది. ఉదాహరణకు మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, ఐరన్తో పాటు తదితర ఖనిజాల అన్వేషణకు ఉపయోగపడనున్నది. అయితే, ప్రజ్ఞాన్ రోవర్ వెళ్లిన సమయంలో లోగోలు అంత స్పష్టంగా లేవని ఇస్రో చీఫ్ సోమ్నాథ్ తెలిపినట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి. చంద్రుడి నేల పూర్తిగా భిన్నమైందని ముందే తెలుసునని, భిన్నమైన విషయం ఏంటో మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజ్ఞాన్ రోవర్ నడిచిన మార్గంలో మట్టి మురికిగా లేదని, ముద్దగా ఉందని చెప్పారు. దాన్ని ఏదో కట్టివేస్తున్నట్లుగా గ్రహించామని.. మట్టిని ముద్దగా మారుస్తుంది ఏంటో అధ్యయనం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి.