Anand Mahindra | భారతదేశం చారిత్రాత్మక విజయం సాధించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో జాబిల్లిని ముద్దాడింది. గతంలో ఏ దేశం చేపట్టిన విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారత్పై అభినందనల వర్షం కురుస్తున్నది. అయితే, ఇస్రో ప్రయోగంపై అంతర్జాతీయ మీడియా ఛానెల్ బీబీసీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో న్యూస్ చానెల్ యాంకర్ భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో ధీటుగా స్పందించారు.
వివరాల్లోకి వెళితే.. చంద్రయాన్ ప్రయోగంపై యాంకర్ స్పందిస్తూ ‘చాలా మంది దీనిపై ఆలోచిస్తున్నారు. అందుకు నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత్లో ఇప్పటికీ ఎంతో మంది పేదరికంలో ఉన్నారు. మౌలక సదుపాయాల కల్పనలో భారత్ ఇంకా వెనుకంజలో ఉంది. సుమారు 70కోట్ల మందికి మరుగుదొడ్లు లేవు. ఈ పరిస్థితుల్లో ఇంత భారీగా ఖర్చు చేసి భారత్కు అంతరిక్ష పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందా? అని చర్చలో పాల్గొన్న మరొకరిని యాంకర్ ప్రశ్నించాడు. అయితే, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఈ క్రమంలో ఆయన ఘాటుగానే స్పందించారు.
‘మీరు చెబుతున్న పేదరికం వలస పాలనలో వందల సంవత్సరాలు భారత వనరుల్ని ప్రణాళికాబద్ధంగా దోచుకున్నదాని ఫలితమే. మా నుంచి విలువైన కోహినూర్తో పాటు శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసాలను సైతం దోచుకున్నారు. వలసపాలన ముఖ్య ఉద్దేశం సంపదను దోచుకోవడం మాత్రమే కాదు.. ప్రజలను ఆత్మన్యూనతకు గురిచేసి బాధితులుగా మార్చడమే. ప్రస్తుతం మీరు టాయిటెల్స్, అంతరిక్ష పరిశోధనలపై పెట్టుబడులను ప్రశ్నించడం ఈ వైఖరికి భిన్నమైందేమీ కాదు.
మేం చంద్రుడిపైకి చేరుకోవడం మా దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుకోవడంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. విజ్ఞాన రంగంలో పురోగతిని సాధించేందుకు మాకు నమ్మకాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పేదరికం నుంచి బయటపడాలనే ఆకాంక్షలను ప్రేరేపిస్తుంది. వాస్తవానికి పేదరికం అంటే ఏంటంటే.. ఆకాంక్షల్లో సైతం పేదరికాన్ని కలిగి ఉండడమే’నని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. దీనిపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమాధానం ఇచ్చారంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Really?? The truth is that, in large part, our poverty was a result of decades of colonial rule which systematically plundered the wealth of an entire subcontinent. Yet the most valuable possession we were robbed of was not the Kohinoor Diamond but our pride & belief in our own… https://t.co/KQP40cklQZ
— anand mahindra (@anandmahindra) August 24, 2023